ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2020, 5:11 PM IST

ETV Bharat / city

కేంద్రం జోక్యం చేసుకుని ఎస్​ఈసీని తొలగించాలి: మోపిదేవి

ఎవరి ప్రలోభాలతో ఎస్​ఈసీ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. తెదేపా చేసిన కుట్రలో భాగస్వామి అయిన ఎన్నికల కమిషనర్​ను తొలగించాలని డిమాండ్ చేశారు.

minister-mopidevi-comments-on-sec-over-elections-postpone
minister-mopidevi-comments-on-sec-over-elections-postpone

మోపిదేవి వెంకటరమణ

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై మంత్రి మోపిదేవి ఎస్​ఈసీని విమర్శించారు. ఎవరి ప్రలోభాలతో ఎన్నికలను వాయిదా వేశారని ప్రశ్నించారు. కేవలం కరోనా సాకుతో ఇలా చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందా లేదా అన్న సందేహాం తలెత్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తెదేపా చేసిన కుట్రలో ఎస్​ఈసీ భాగస్వామి అయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఎస్​ఈసీని వెంటనే తొలగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details