ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2022, 8:07 AM IST

ETV Bharat / city

Dargah to Durga Walk : గుంటూరులో దర్గా టూ దుర్గా నడక

Dargah to Durga Walk : మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో దర్గా టూ దుర్గా నడక కార్యక్రమం చేపట్టారు. జాతీయ సమైక్యతను చాటుతూ వివిఐటి ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఇలా ర్యాలీ నిర్వహిస్తారు.

Dargah to Durga Walk
గుంటూరులో దర్గా టూ దుర్గా నడక...

Dargah to Durga Walk : మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో 'దర్గా టూ దుర్గా' నడక కార్యక్రమం చేపట్టారు. జాతీయ సమైక్యతను చాటుతూ, వివిఐటి ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న ఈ నడక ర్యాలీని డీఎస్పీ సుప్రజ, డీఐజి త్రివిక్రం వర్మ సతీమణి సువర్ణ ప్రారంభించారు. వివిఐటి ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ దర్గా టూ దుర్గా నడకలో పాల్గొన్నారు.

గుంటూరులోని హజరత్ కాలేషా మస్తాన్ వలీ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మొత్తం 33 కిలోమీటర్ల మేర నడక కొనసాగనుంది. ఇందులో వివిఐటి కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మహిళా సాధికారత, యువతకు నడకపై చైతన్యం కోసం నడక ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details