ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2021, 9:00 PM IST

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9PM

  • రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ కాలం పొడిగింపు
    కొవిడ్ కారణంగా రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఉన్న కర్ఫ్యూను కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు..
    రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సావిత్రమ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇడుపులపాయలో వైఎస్‌ఆర్​కు ఘన నివాళి
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. వైఎస్ కుటుంబం ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
    రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 11 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 8 రోజుల్లో 200కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫేక్​ న్యూస్​పై సుప్రీం ఆగ్రహం..
    దేశంలోని కొన్ని మీడియా వర్గాలు.. ప్రతి విషయాన్ని మతకోణంలో చూపుతున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కంటెంట్ విషయంలో సామాజిక మాధ్యమాలు, వెబ్​పోర్టళ్లలో జవాబుదారీతనం కొరవడిందని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'తాలిబన్ల​తో చర్చల ముఖ్య ఉద్దేశం అదే'
    ఖతార్​లో తాలిబన్ల నేతతో భారత రాయబారి సమావేశంపై(India Taliban Talks) క్లారిటీ ఇచ్చింది విదేశాంగ శాఖ. అఫ్గాన్​(Afghanistan news) భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోకుండా చూడటం, అక్కడి భారతీయులను వెనక్కి రప్పించటం వంటి అంశాలను తెలియజేసేందుకే భేటీ అయినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాబుల్​ ఎయిర్​పోర్ట్​లో మళ్లీ ఎగిరిన విమానం..!
    అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా బలగాలు వెల్లిపోయిన తర్వాత కాబుల్​ విమానాశ్రయంలో(Kabul Airport) తొలి విమానం ఎగిరింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఓ వీడియోను షేర్​ చేశారు తాలిబన్​ ప్రతినిధి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను ఎలా కొనాలి?
    2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6వ విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఆగస్టు 30 నుంచి ఈ నెల 3 వరకు అందుబాటులోకి ఉండనున్నాయి. మరి ఈ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్ తడబాటు.. టీ విరామానికి 122/6
    నాలుగో టెస్టులో కోహ్లీ సేన ధాటిగా ఆడలేకపోతుంది. టీ బ్రేక్​ సమయానికి 122/6తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో పంత్, శార్దుల్ ఠాకుర్ ఉన్నారు. కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ముగిసిన నటి చార్మి విచారణ..
    తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆమెను విచారించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details