నేడు అమరావతి గ్రామాల్లో మహిళా ఐకాస పర్యటన
నేడు రాష్ట్ర మహిళా ఐకాస సభ్యులు అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. ఇవాళా, రేపు దీక్షలకు మద్దతు తెలుపనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస నేతలు వెల్లడించారు. ఇవాళ కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెనుమాక, మందడం, వెలగపూడి గ్రామాలు పర్యటించనున్నారు. రేపు రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ, అడ్డరోడ్డులోని దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటిస్తామని తెలిపారు. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలని మహిళా ఐకాస డిమాండ్ చేస్తోంది.
నేడు అమరావతి గ్రామాల్లో మహిళా ఐకాస పర్యటన