ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2022, 7:56 PM IST

ETV Bharat / city

సీఎం జగన్​ను కలిసిన స్టార్ షట్లర్‌ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజనీ

PV Sindhu and Rajani meets CM Jagan భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజనీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో పీవీ సింధు స్వర్ణ పతకం సాధించగా భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

PV Sindhu and Rajani meets CM Jagan
షట్లర్‌ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజనీ

PV Sindhu and Rajani meets CM Jagan: ముఖ్యమంత్రి జగన్​ను భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని కలిశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి సహా.. సింధు, రజని కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి సింగిల్స్‌లో పసిడి పతకం గెలిచిన పీవీ సింధు... తాను సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో ఉమెన్స్‌ హాకీ టీమ్ కాంస్య పతకం సాధించగా.. ఇ.రజని గోల్‌ కీపర్‌గా వ్యవహరించారు. హాకీ టీమ్‌ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్‌ టీ షర్ట్‌ను సీఎంకు రజని బహుకరించారు.

అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న సింధు, రజనీలను సీఎం జగన్​ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని సీఎం తెలిపారు. హాకీ క్రీడాకారిణికి రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details