ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2020, 10:39 PM IST

ETV Bharat / city

తితిదే పరిధిలోకి మరో ఏడు దేవాలయాలు.. ఉత్తర్వులు జారీ

చిత్తూరు జిల్లాలోని ఏడు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.

-ttd
-ttd

చిత్తూరు జిల్లాలోని ఏడు దేవాలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువస్తూ దేవాదాయశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నవేంకటేశ్వర స్వామి దేవాలయం సహా మరో ఆరు దేవాలయాలను తక్షణం తితిదే పరిధిలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేయటంతో పాటు ధూపదీప నైవేద్యాల బాధ్యతను ఇక నుంచి తితిదే పర్యవేక్షించనుంది.

ABOUT THE AUTHOR

...view details