ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2021, 5:26 PM IST

ETV Bharat / city

TELANGANA HIGH COURT : దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్​ దాఖలైంది. హుజూరాబాద్​ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఈ పథకం ప్రవేశపెట్టిందని ఆరోపిస్తూ పలు పార్టీలు సంయుక్తంగా వ్యాజ్యం​ దాఖలు చేశాయి. ఈ మేరకు సుమోటోగా స్వీకరించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

HIGH COURT
HIGH COURT

తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టును చేపట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జనవాహిని పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ సంయుక్తంగా పిల్ దాఖలు చేశాయి. పైలట్ ప్రాజెక్టులో 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ఖర్చు చేయడం రాజ్యాంగంలోని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.

ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, ఈసీ, తెరాస, కాంగ్రెస్, భాజపాతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్​ను వ్యక్తిగతంగా పిటిషన్​లో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేపట్టిన దళితబంధు పైలట్ ప్రాజెక్టును సుమోటోగా స్వీకరించాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరగా.. సీజే హిమాకోహ్లి, విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ వేస్తే పరిశీలిస్తామని సూచించింది.

ఇదీ చదవండి:VIVEKA MURDER: వివేకా హత్య కేసులో 54వ రోజు కొనసాగుతున్న విచారణ

ABOUT THE AUTHOR

...view details