ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 26, 2021, 2:54 PM IST

ETV Bharat / city

ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి

మదర్ థెరిస్సా జయంతిని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొని మదర్‌ థెరిస్సాకు నివాళులర్పించారు.

Mother Theresa Jayanti Celebrations
మథర్ థెరిస్సా జయంతి వేడుకలు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో మదర్ థెరిస్సా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ వేడుకలను జరిపారు. మదర్‌ థెరిస్సా చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. థెరిస్సా సేవా గుణాన్ని గుర్తు చేసుకున్న నేతలు.. జోలె పట్టి అనాథల కడుపు నింపి అమ్మగా నిలిచారని కొనియాడారు. థెరిస్సాకు మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్​బాబు, గన్ని వీరాంజనేయులు, ఏవీ రమణ, దొరబాబు, దారపనేని నరేంద్రబాబు, వల్లూరి కుమార స్వామి.. నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details