'హైపవర్ కమిటీ అభిప్రాయాలు ఎవరికి వెల్లడిస్తున్నారు'
By
Published : Dec 31, 2019, 8:29 PM IST
అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్ ఇచ్చాక కర్నూలు తరలిస్తామనడం చట్ట విరుద్ధమని తెదేపా ఎంపీ కననమేడల వ్యాఖ్యానించారు. రాజధానిపై వేసిన హైపవర్ కమిటీ సభ్యులు ఒక్కసారైనా సమావేశం కాకుండానే ఎవరికి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని ఆయన నిలదీశారు.
మూడు రాజధానులపై కనకమేడల వ్యాఖ్యలు
మూడు రాజధానులపై కనకమేడల వ్యాఖ్యలు
మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని తెదేపా ఎంపీ కననమేడల రవీంద్రకుమార్ వైకాపా సర్కారుకు హితవు పలికారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నోటిఫికేషన్ ఇచ్చాక కర్నూలు తరలిస్తామనడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాజధానిపై వేసిన హైపవర్ కమిటీ సభ్యులు ఒక్కసారైనా సమావేశం కాకుండానే ఎవరికి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని కనకమేడల ఆక్షేపించారు.