ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2020, 3:33 PM IST

ETV Bharat / city

'వరద సాయం అందించపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తాం'

తెలంగాణ ప్రభుత్వ తీరుపై.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. వరద సాయం విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గకూడదని డిమాండ్ చేశారు. ఏడో తేదీ నాటికి వరద సాయం అందించకపోతే.. ప్రగతిభవన్​, జీహెచ్​ఎంసీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.

if flood relief is not distributed pragati bhavan will be besieged said komatireddy
వరద సాయం అందించపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు చూసైనా.. నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వరద సాయం అందని వారికి ఏడో తేదీ నాటికి అందజేయాలని.. లేదంటే ప్రగతి భవన్, గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details