ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2021, 5:03 PM IST

Updated : Aug 10, 2021, 5:19 PM IST

ETV Bharat / city

Highcourt: ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలి: హైకోర్టు

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ
జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ

జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 17లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Last Updated : Aug 10, 2021, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details