ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 7:59 PM IST

ETV Bharat / city

జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి మృతికి గవర్నర్ సంతాపం

జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏపీకి చెందిన జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి అమరులయ్యారు. జవాను మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Govenor biswa bhushan
Govenor biswa bhushan

చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన జవాను చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్ము- కశ్మీర్​లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారని అన్నారు. వీర జవాను కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన గవర్నర్... ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం

ABOUT THE AUTHOR

...view details