చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన జవాను చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్ము- కశ్మీర్లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారని అన్నారు. వీర జవాను కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన గవర్నర్... ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు