రాజధాని అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఫీజు చెల్లింపు నిమిత్తం 5 కోట్ల రూపాయల కేటాయింపునకు సంబంధించి జారీచేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్బాబు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇంత భారీ మెుత్తంలో రుసుము చెల్లించేందుకు న్యాయవాదులు చట్టం అనమతిస్తుందో లేదో పరిశీలించాలని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జీవోను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు.
రోహత్గీకి రూ. 5కోట్ల ఫీజుపై హైకోర్టులో వ్యాజ్యం - ముకుల్ రోహత్గీకి 5 కోట్ల ఫీజు చెల్లింపు న్యూస్
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి భారీ మెుత్తంలో ఫీజు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
![రోహత్గీకి రూ. 5కోట్ల ఫీజుపై హైకోర్టులో వ్యాజ్యం filed petetion about mukul rohatgi fee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5890125-231-5890125-1580333486926.jpg)
filed petetion about mukul rohatgi fee