ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కృష్ణకిశోర్​ను అరెస్టు చేయవద్దు: హైకోర్టు

By

Published : Dec 19, 2019, 11:46 PM IST

ఐఆర్​ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్​కు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయకుండానే దర్యాప్తు కొనసాగించాలని సీఐడీని ధర్మాసనం ఆదేశించింది.

krishna kishore
కృష్ణ కిశోర్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఆర్​ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్... తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. దర్యాప్తు మాత్రం కొనసాగించాలని చెప్పింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

సంబంధిత కథనాలు

ABOUT THE AUTHOR

...view details