గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలపై సమీక్షించిన ఆయన...పలు అంశాలపై చర్చించారు. విమానాశ్రయాల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇంకా 98 ఎకరాలు సేకరించాలని తెలిపారు.
ఓర్వకల్లు విమానాశ్రయంతో పాటు దగదర్తి విమానాశ్రయం కోసం భూమి సేకరించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వాటర్ డ్రోమ్ ప్రాజెక్టుపై ఏఏఐ ఆసక్తిగా ఉందన్నారు. కడప విమానాశ్రయ విస్తరణకు భూమి సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.