నవరత్నాల పథకాలకు నిధుల సేకరణ కోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అభివృద్ధి చేసి విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు మరో అడుగు ముందుకేసింది. బిల్డ్ ఏపీ మిషన్కు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ, అమలు కమిటీలకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్తో పాటు సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు, నేషనల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ ఛైర్మన్గా... ప్రభుత్వం నామినేట్ చేసేవారు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ భూముల గుర్తింపు, విక్రయం, ఎస్క్రో ఖాతాల ద్వారా నిధుల నిర్వహణ, గుర్తించిన భూముల్లో మౌలిక సదుపాయల కల్పనను జిల్లాస్థాయి అమలు కమిటీ పూర్తి చేయనుంది.
ఈ బిడ్డింగ్ ద్వారా భూముల వేలం