వ్యవసాయ పంపుసెట్లు ఏటా 3 శాతం పెరుగుతుండటంతో రాయితీ మొత్తం 2030-31 నాటికి రూ.17,819 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం సౌర విద్యుత్తోనే సాధ్యమని భావిస్తోంది. ఇందులో భాగంగానే 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి
రాష్ట్రంలో వ్యవసాయానికి పగలు 9 గంటల ఉచిత విద్యుత్ను ఇచ్చేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. నాణ్యమైన విద్యుత్ అందించడం సౌరవిద్యుత్తోనే సాధ్యమని భావిస్తోంది.
ap govt permission to 10 thousand megawatts solar plant
ఈ ప్లాంటు నిర్మాణ బాధ్యతను ఏపీ గ్రీన్ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శక విధానంలో బిడ్డింగ్ నిర్వహించాలని సూచించింది. ఈ ప్రాజెక్టుకు గ్రామపంచాయతీల ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మినహాయింపునిచ్చింది.
ఇదీ చదవండి:నవరత్నాలకే ప్రాధాన్యం.. బడ్జెట్ అంచనా రూ.2.30 లక్షల కోట్లు..!