ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ల నడుమ ట్వీట్స్ వార్(ktr and raja singh tweets) సాగుతోంది. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఓల్డ్ సిటీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ బైక్పై పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్(mla raja singh challenge to minister ktr) సవాలు విసిరారు. చిన్నపాటి వర్షానికి ఓల్డ్ సిటీ ప్రాంతంలో రహదారులు, దుకాణాలు, ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు.
ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని(ktr challenge to mla raja singh) మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్పీజీ ధరలపైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. భాజపా పాలనలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడమా? అంటూ ప్రశ్నించారు. మాటల గారడీ ఆపి మంచి పనులతో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని రీట్వీట్ చేశారు.
కొద్దిపాటి వర్షానికే పాతబస్తీ మునిగిపోతుందని.. వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తనతో కలిసి బైక్ మీద తిరగాలని కేటీఆర్ను ట్విట్టర్ వేదికగా ఆహ్వానిస్తే ఆరు రోజులు ఆలస్యంగా స్పందించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ట్వీట్ చేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారని మండిపడ్డారు.