ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'

By

Published : Dec 22, 2019, 4:36 PM IST

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. రూపాయి రూపాయి లెక్క పెట్టుకుని బతికే వారికి కొండంత కష్టం వచ్చింది. కుటుంబ పెద్దకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఉన్నతందా ఊడ్చిపెట్టి నాలుగేళ్లుగా వైద్యం చేయించారు. ఇప్పుడు కనీస వైద్యం చేయించలేక... భర్త అవస్థను చూడలేక సాయంకోసం దీనంగా ఎదురుచూస్తోంది తెలంగాణలోని జగిత్యాలకు చెందిన ఓ పేద కుటుంబం.

Financial Help for Treatment of Kidney Failure
సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణలో ఓ కుటుంబం

సాయం చేయాలని దీనంగా వేడుకుంటోన్న లక్ష్మి

కూలికి వెళ్తేగాని పూట గడవని ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. ఇంటి పెద్దకు రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న తన భర్తను రక్షించుకోవాలన్న తపనతో అతని భార్య ఉన్నదంతా ఊడ్చి వైద్యానికి లక్షలు వెచ్చించింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. కనీస వైద్యం చేయించడానికి చేతిలో చిల్లగవ్వలేక... ఉదార మనసు కలిగిన దాతల కోసం ఆమె ఎదురుచూస్తోంది.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పెంట రాజయ్యది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల కిందట రాజయ్యకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్​ కోసం ఉన్నదంతా ఊడ్చి ఖర్చు పెట్టారు. ఇప్పుడు కనీసం వైద్య ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక... రోజురోజుకూ దిగజారుతున్న భర్త ఆరోగ్యాన్ని చూడలేక ఆమె పడుతున్న మనోవేదన వర్ణణాతీతం.

రాజయ్య భార్య లక్ష్మీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్తకు వైద్యం ఎలా చేయించాలో తెలియక కన్నీరు మున్నీరవుతోంది. మనసున్న మారాజులు ఎవరైనా సాయం అందిస్తే.. తన భర్త ప్రాణం నిలబెట్టినవారవుతారని అశ్రునయనాలతో అర్థిస్తోంది.

ఇదీ చూడండి:

ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details