కూలికి వెళ్తేగాని పూట గడవని ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. ఇంటి పెద్దకు రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న తన భర్తను రక్షించుకోవాలన్న తపనతో అతని భార్య ఉన్నదంతా ఊడ్చి వైద్యానికి లక్షలు వెచ్చించింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. కనీస వైద్యం చేయించడానికి చేతిలో చిల్లగవ్వలేక... ఉదార మనసు కలిగిన దాతల కోసం ఆమె ఎదురుచూస్తోంది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన పెంట రాజయ్యది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల కిందట రాజయ్యకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్ కోసం ఉన్నదంతా ఊడ్చి ఖర్చు పెట్టారు. ఇప్పుడు కనీసం వైద్య ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక... రోజురోజుకూ దిగజారుతున్న భర్త ఆరోగ్యాన్ని చూడలేక ఆమె పడుతున్న మనోవేదన వర్ణణాతీతం.