ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2022, 7:33 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా కేసులు.. ఒకరి మృతి

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినుంచి నిన్న 803 మంది పూర్తిగా కోలుకున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 136 కరోనా కేసులు

CORONA CASES: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 15,654 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 136 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల నిన్న చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 803 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

దేశంలో తగ్గిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 10,273 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ నుంచి మరో 20,439 మంది కోలుకున్నారు. వైరస్​ కారణంగా 243 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉంది.

ఇదీ చదవండి:

Milan-2022: సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైంది: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details