ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ముస్లింలు రంజాన్ ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా దర్గాల వద్ద షామియానాలు, మంచినీళ్ళు, కూలర్లు ఏర్పాటు చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.