ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం

బస్సు నుంచి దిగమన్నందుకు కాల్పులు జరిపాడో వ్యక్తి. సికింద్రాబాద్​ నుంచి ఫిల్మ్​నగర్‌లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు.

By

Published : May 2, 2019, 3:30 PM IST

పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం

పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. బస్సు నుంచి కిందకు దిగమన్నారని గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి కాల్పులతో బస్సు పైభాగంలో తూటా దూసుకుపోయి రంధ్రం పడింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్​స్టాప్​లో బస్​ను ఆపకుండానే డ్రైవర్ తీసుకెళ్లాడు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details