ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్యూ కట్టిన విద్యార్థులు.. దర్శనమిస్తున్న 'నో అడ్మిషన్' బోర్డు

By

Published : Jun 29, 2019, 4:31 PM IST

ఆ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు చేరారు. తరగతి గదులన్నీ నిండిపోయాయి. ఇక విద్యార్థులను చేర్చుకోలేమంటూ ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు తగిలించారు. ఇది ఏదో పేరున్న కార్పొరేట్ పాఠశాల అనుకుంటే మీరు పొరబాటుపడ్డట్టే. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పురపాలక ఆంగ్ల మాధ్యమ యూపీ స్కూల్​లో పరిస్థితి.

ప్రభుత్వ పాఠశాలలో దర్శనమిస్తున్న.. నో అడ్మిషన్ బోర్డు

ప్రభుత్వ పాఠశాలలో దర్శనమిస్తున్న.. నో అడ్మిషన్ బోర్డు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పురపాలక ఆంగ్ల మాధ్యమ యూపీ స్కూల్​లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నాటి నుంచి ప్రతియేటా విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేందుకు పోటీ పడుతూనే ఉన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో 300కు పైబడి ఉన్న విద్యార్థుల సంఖ్య.... నేడు 500కు చేరింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 13 సెక్షన్లు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఏడుగురు ఉపాధ్యాయులే ఉన్నారు. మరో 11 మంది కావాలి. గత మార్చిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల స్థానంలో ఇంతవరకు ఎవరూ రాలేదు. స్థానికంగా పట్టభద్రులైన కొంతమంది యువత సహాయం తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నా... ఉపాధ్యాయుల కొరతతో చేర్చుకోలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయురాలు వెంకట సత్యవతి అంటున్నారు.

పాఠశాలలో విద్యార్థులు చేరటానికి ఆసక్తిగా ఉన్నా... తగినస్థాయిలో ఉపాధ్యాయులు లేక...నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి :పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details