ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కుందేరు కాలువ అధునీకరణకు ప్రణాళికలు

కుందేరు కాలువను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాలలో డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుందేరు కాలువ పరిశీలించారు.

By

Published : Jun 6, 2019, 3:16 PM IST

కుందేరు కాలువ అధునీకరణకు ప్రణాళికలు

ప్రకాశం జిల్లాలో ఈపురుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఉన్న కుందేరు కాలువ ఆక్రమణకు గురైందని, దానివల్ల నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతుందని... దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో కుందేరుని ప్రక్షాళన చేసి పూడికలు తొలగించి నీటిపారుదల జరిగే విధంగా చర్యలు చేపడతామని బలరాం చెప్పారు. కార్యక్రమంలో డ్రైనేజీ అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కుందేరు కాలువ అధునీకరణకు ప్రణాళికలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details