ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

వివేకా హత్యలో విషయంలో బండారం బయటపడుతుందనే... సిట్​ విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని జగన్​ హైకోర్టులో పిటిషన్​ వేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జగన్​కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

By

Published : Mar 27, 2019, 8:19 PM IST

జగన్​కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ


ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్​ డీజీని తప్పించడం సంఘ విద్రోహ శక్తులకు ఊతమివ్వడం కాదా? అని మంత్రి కళా వెంకట్రావు జగన్​ను బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

లేఖలోని ముఖ్యాంశాలు...
⦁ కుటుంబంలో హత్య జరిగితే విచారణ వేగంగా జరగాలని, దోషులకు శిక్ష పడాలని కోరుతారు. కానీ జగన్​ మాత్రం విచారణ అధికారులను తప్పించి తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
⦁ వివేకా హత్య కేసులో జగన్​బండారం బయటపడుతుందనే విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని హైకోర్టులో పిటిషన్​ వేయలేదా..?
⦁ హోదా ఇస్తే పరిశ్రమలు ఏపీకి వెళ్తాయని కేసీఆర్‌ అండ్‌ కో అన్నారు. అలాంటి తెరాస నేతలు ఏపీకి హోదా రానిస్తారా?
⦁ జగన్‌కు జన్మభూమి కంటే కేసీఆర్‌ ప్రగతిభవనే ముఖ్యమా?..అవినీతి సొమ్ము కోసం కేసీఆర్‌కు రెడ్‌కార్పెట్‌ వేయడం స్వార్థం కాదా?
⦁ మీ బెదిరింపులకు లొంగని నేతలపై ఐటీ దాడులు నిజం కాదా? అని కళా వెంకట్రావు జగన్​ను ప్రశ్నించారు.
⦁ కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని తన బంధాన్ని జగన్‌ బయటపెట్టారు. మోదీతో బంధాన్నీ బహిర్గతం చేసి రెండో ముసుగు తొలగించాలని డిమాండ్​ చేశారు.
⦁ అధికారులను బదిలీ చేయాలని లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్​ కోరిన వెంటనే బదిలీ చేశారంటే వారిబంధం ఎలా ఉందో అర్థం అవుతుందని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details