ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 6, 2019, 9:49 PM IST

ETV Bharat / briefs

9న తిరుపతికి ప్రధాని.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

ఈ నెల 9న ప్రధాని మోదీ తిరుమలకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.... తితిదే అధికారులు, చిత్తూరు కలెక్టర్​తో సమీక్షించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని మోదీ తిరుపతి పర్యటనపై సీఎస్ సమీక్ష

ప్రధాని మోదీ తిరుపతి పర్యటనపై సీఎస్ సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9న ప్రధాని తిరుపతి రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ చేశారు. తితిదే అధికారులు, చిత్తూరు కలెక్టర్ తదితరులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ప్రధాని... 9వ తేదీ సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి దిల్లీకి పయనమవుతారు. ఈ మేరకు.. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details