ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2019, 7:34 AM IST

ETV Bharat / briefs

" అయోధ్య వివాదంలో కోర్టు పాత్ర పరిమితం"

అయోధ్య వివాదం, పాకిస్థాన్ ఉనికిపై భాజపానేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

సుబ్రహ్మణ్య స్వామి

అయోధ్య వివాదంపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన
బాబ్రీ మసీదు - రామమందిరం వివాదంలో కోర్టు పాత్ర పరిమితమేనని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ముంబయిలోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... వివాద రహిత స్థలాన్ని తీసుకొని, రెండేళ్లలో రామమందిరం నిర్మించవచ్చని తెలిపారు.

గత నెలలో కేంద్ర ప్రభుత్వం, వివాద రహిత స్థలాన్ని అసలు యజమానులకు లేదా హిందూ సంఘాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.

వచ్చే దశాబ్దంలో పాకిస్థాన్​ ఉనికిని కోల్పోతుందని, 2020-30 మధ్య ఆ దేశం నాలుగు ప్రావిన్సులుగా విడిపోతుందని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details