ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బొద్దింక బిర్యానీ..కేరాఫ్ హైదరాబాద్

By

Published : Feb 2, 2019, 9:05 PM IST

రొయ్యల బిర్యానీ తినాలని రెస్టారెంట్​కు వెళ్తే బొద్దింక బిర్యానీ రుచి చూపించారు..ఇదెక్కడో కాదు హైదరాబాద్​లోనే..

బొద్దింక బిర్యానీ..కేరాఫ్ హైదరాబాద్

హైదరాబాద్ నిజాంపేటలోని 'గోదావరి రుచులు' రెస్టారెంట్​లో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. కుటుంబ సభ్యులతో వెళ్లిన రాజు..ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అది సరిగ్గా లేకపోవడంతో సిబ్బందికి చెప్పి మరోకటి తెప్పించుకున్నాడు. అందులో బొద్దింక చూసి అవాక్కయ్యాడు. ప్రాన్స్ బిర్యానీలో బొద్దింక కనిపించడంతో రెస్టారెంట్ వారిని నిలదీశాడు రాజు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా.. చూసి చూడనట్లు పోవాలని ఉచిత సలహా ఇచ్చారు నిర్వాహకులు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. అధికారులు నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details