national

రైలు ఢీకొని - ఐదు కిలోమీటర్ల పాటు ఇంజిన్​కు వేలాడుతూ?

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 9:01 AM IST

Old man died after being hit by that train
Old man died after being hit by that train (ETV Bharat)

Old man died after being hit by that train: మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో రైలుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైలుపట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టి, మృతదేహంతో వేలాడుకుంటూ ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ వరకు తీసుకువచ్చింది. ఆ దృశాన్ని ఘటకేసర్​లోని రైల్వే గేటు వద్ద వాహనాదారులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ట్రైన్ ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. బీబీనగర్-ఘటకేసర్ రైల్వేస్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్ వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రైలు ముందు భాగానికి చిక్కుకొని సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు అలాగే వేలాడుతూ వచ్చింది. మృతుడు నీలంరంగు చొక్కా వేసుకుని, ఆరేంజ్ రంగు లుంగీ, కుడిచేతికి కడెం ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details