రైల్వే భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాం: హుబ్లీ డివిజనల్ మేనేజర్ హర్ష కరే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 12:50 PM IST
![రైల్వే భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాం: హుబ్లీ డివిజనల్ మేనేజర్ హర్ష కరే Hubli Railway Manager Visit Raidurgam Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/1200-675-21744462-thumbnail-16x9-railway-manager.jpg)
Hubli Railway Manager Visit Raidurgam Station: రైల్వే భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ హర్ష కరే వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రైల్వే స్టేషన్ను డీఆర్ఎం బుధవారం తనిఖీ చేశారు. హుబ్లీ నుంచి ఉదయమే రాయదుర్గంకు ప్రత్యేక రైలులో చేరుకున్న ఆయనకు రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలో నిర్మించిన నూతన రైల్వే ట్రాక్ను ఆయన పరిశీలించారు. రాయదుర్గంలో నిర్మాణ దశలో ఉన్న నూతన రైల్వే భవనాలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రైల్వే ప్రమాద ఘటన వివరిస్తూ భద్రతా ప్రమాణాల పెంపుపై దిశానిర్దేశం చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్ నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతి వెళ్లే రైలు ఆగిపోయిందని దానిని పునరుద్ధరించాలని కోరారు. రాయదుర్గం స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.