ఇంట్లో చెలరేగిన మంటలు- ఒకే ఫ్యామిలీలోని ఐదుగురు సజీవదహనం- కారణం అదేనా?
Published : Jun 13, 2024, 6:53 AM IST
Fire Accident In House :ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్లోని ఓ ఇంట్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బహ్తా హాజీపుర్లో ఉన్న రెండంతస్తుల ఇంట్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండంతస్తుల ఇంట్లో నివాసముంటున్న వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు చెప్పారు.
TAGGED:
FIRE ACCIDENT IN HOUSE