ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 11:24 AM IST

ETV Bharat / videos

వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి భూ కబ్జా- చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు - EX MLA Thippeswamy Land Grab

EX MLA Thippeswamy Land Grab : గత వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు భూదాహంతో కనిపించిన భూములను మింగేశారు. ఏ భూమైనా సరే వారికి నచ్చిందంటే అది హాంఫట్. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూమి అనే తేడా లేకుండా ఆక్రమించేశారు. ఇప్పుడు ఆ భూదోపిడీ పర్వాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు ఉదుగూరు గ్రామంలో పర్యటించారు. అక్కడి కాలనీలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి తన ఇంటి వద్ద ఉన్న ఆర్​అండ్​బీ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అంతేకాక భూమి చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఎంస్​ రాజు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఆ భూమిని సర్వే చేయించి అందులోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. తిరిగి ఆ  ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్పందించారు. తాను ఆర్​అండ్​బీ భూమిని ఆక్రమించి ఉంటే సర్వే చేయించవచ్చని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details