ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - Chandrababu Review Meetings

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 10:44 AM IST

Updated : Aug 12, 2024, 2:25 PM IST

Chandrababu Review Meetings : సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు.

Chandrababu Review Meetings
Chandrababu Review Meetings (ETV Bharat)

Chandrababu Review Various Departments Today :ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు హామీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం వైద్యారోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన, క్రీడల శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైనా అధికారులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా శాఖల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

Last Updated : Aug 12, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details