TOP TEN NONVEG STATES LIST IN INDIA : తెలంగాణలో మాంసాహారం లేకుండా పండుగలు, వివాహాది శుభకార్యాలు జరగవనేది నిజమే. ఏపీతో పోలిస్తే అక్కడ నాన్ వెజ్ వాడకం ఎక్కువని ప్రచారం ఉన్నమాట వాస్తవమే. కానీ, అదంతా అపోహే అని తేలిపోయింది. అంచనాలు తలకిందులయ్యాయి. నాన్ వెజ్ వాడకంలో తెలంగాణతో పోలిస్తే ఏపీ ముందంజలో ఉందని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వెల్లడించింది.
వారాంతమైనా, వేడుకైనా, పండుగైనా నాన్ వెజ్ కామనై పోయింది. అంతేకాకుండా వారంలో రెండు, మూడు రోజులు మాంసాహారం సర్వసాధారణంగా మారిపోయింది. బిర్యానీ, తందూరీ, ఫ్రై, పులావ్ ఇలా ఎన్నో రకాలుగా మాంసాహార వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (NHFS-5) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా నాన్ వెజ్ తినడంలో టాప్ 10 రాష్ట్రాల జాబితా వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం మాంసాహార వినియోగంలో తెలంగాణ ఏడో స్థానంలో నిలవడం గమనార్హం. కేరళ తర్వాత ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ఏ రాష్ట్రం ఏ స్థానం దక్కించుకుందో వివరాలు చూద్దామా?!
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
నాగాలాండ్ :దేశంలో అత్యధికంగా మాంసాహారం తీసుకోవడంలో నాగాలాండ్ రాష్ట్ర ప్రజలు ముందున్నారు. రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు మాంసాహార ప్రియులే. 99.8% ప్రజలు నాన్ వెజ్ తింటారని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా మాంసం వినియోగంలో నాగాలాండ్ టాపర్గా నిలిచింది.
పశ్చిమ బెంగాల్ : మాంసాహార వినియోగంలో నాగాలాండ్ తదుపరి స్థానం పశ్చిమ బెంగాల్. ఇక్కడ 99.3 శాతం ప్రజలు నాన్ వెజ్ తీసుకుంటారని వెల్లడిస్తూ రెండో స్థానం కట్టబెట్టింది. సహజంగా బెంగాళీలు చేపలు అధికంగా తినడం తెలిసిందే.
కేరళ :నాన్ వెజ్ వాడకంలో కేరళ తొలి మూడో స్థానం ఆక్రమించింది. రాష్ట్రానికి సముద్ర తీర రేఖ అధికంగా ఉండడంతో సీఫుడ్ విరివిగా దొరుకుతుంది. 99.1 శాతం మంది మళయాళీలు మాంసాహారం ఆరగిస్తారని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే తేల్చింది.
ఆంధ్రప్రదేశ్ : నాన్ వెజ్ వాడకంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ చికెన్, మటన్, చేపలతోపాటు మాంసాహారం తినేవారు 98.25 శాతం మంది ఉన్నారట. తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యలు దండిగా లభించడం తెలిసిందే.