Private Hospitals Seized in Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నారు. మోత్కూర్లోని శారదా క్లినిక్, మాధవి, తేజ నర్సింగ్ హోమ్లతో పాటు భువనగిరిలోని శ్రీస్వాతి, తేజస్విని ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్ తెలిపారు.
అంతకముందు తుర్కపల్లి మండలం మాదాపూర్లోని సూర్య ఆసుపత్రి, చౌటుప్పల్లోని పూజిత వైద్యశాలను సీజ్ చేశారు. అర్హత లేని వైద్యులు నిర్వహిస్తుండటంతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు, అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నారనే .. ఆరోపణలతో తనిఖీ చేసినట్లు మల్లికార్జున్ వెల్లడించారు.