ETV Bharat / state

హుస్నాబాద్​లో వడదెబ్బతో వృద్ధుడు మృతి

author img

By

Published : May 21, 2020, 3:38 PM IST

పింఛన్​ డబ్బుల కోసం వచ్చిన వృద్ధుడు బ్యాంకు వద్ద వరుసలో నిలబడి వడదెబ్బకు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకుంది.

old man died due to Sunstroke at HUSNABAD in siddipet district
హుస్నాబాద్​లో వడదెబ్బ తగిలి వృద్ధుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో విషాదం చోటుచేసుకుంది. సిద్ధారెడ్డి(65) పింఛన్​ డబ్బుల కోసం హుస్నాబాద్​లోని కేడీసీసీ బ్యాంకు వద్దకు రాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఖాతాదారుల వరుసలో నిలబడ్డాడు. ఆకస్మాత్తుగా తల తిరుగుతుందని కింద పడిపోవడం వల్ల అక్కడే ఉన్న కొంతమంది హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆయనను హుస్నాబాద్​లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పరిశీలించిన వైద్యులు ఆసుపత్రికి తరలించే లోపే సిద్ధారెడ్డి వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బ్యాంక్​కు వచ్చిన సిద్ధారెడ్డి హఠాత్తుగా మరణానికి గురికావడం వల్ల కుటుంబసభ్యులు మున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: భారత్​లో 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో విషాదం చోటుచేసుకుంది. సిద్ధారెడ్డి(65) పింఛన్​ డబ్బుల కోసం హుస్నాబాద్​లోని కేడీసీసీ బ్యాంకు వద్దకు రాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఖాతాదారుల వరుసలో నిలబడ్డాడు. ఆకస్మాత్తుగా తల తిరుగుతుందని కింద పడిపోవడం వల్ల అక్కడే ఉన్న కొంతమంది హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆయనను హుస్నాబాద్​లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పరిశీలించిన వైద్యులు ఆసుపత్రికి తరలించే లోపే సిద్ధారెడ్డి వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బ్యాంక్​కు వచ్చిన సిద్ధారెడ్డి హఠాత్తుగా మరణానికి గురికావడం వల్ల కుటుంబసభ్యులు మున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: భారత్​లో 5 కోట్ల మందికి ​కరోనా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.