రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడలో ఆకతాయి యువకునికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. న్యూఫ్రెండ్స్ కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు నడుచుకుంటూ వెళుతుండగా ఆకతాయి అమె చున్నీ లాగాడు. భయంతో ఆమె కేకలు వేయగా.. స్థానికులు గుమిగూడి ఆ పోకిరిని పట్టుకున్నారు. కోపోద్రిక్తులైన కొందరు స్థానికులు ఆ ఆకతాయికి దేహశుద్ధి చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం