ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత సంచారం.. లేగదూడపై దాడి

author img

By

Published : May 30, 2020, 12:56 PM IST

రంగారెడ్డి జిల్లా ఎక్వాయిపల్లిలో ఓ లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leopard attacked on a calf at ekvayipalli in Rangareddy district
రంగారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత సంచారం.. లేగదూడపై దాడి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో చిరుత సంచారం మళ్లీ కలవరం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఓ లేగ దూడపై చిరుత దాడి చేసింది. ఘటనలో గ్రామానికి చెందిన జెనిగల రాములు అనే రైతుకు చెందిన లేగదూడ మృతి చెందింది.

గత కొన్ని రోజులుగా చిరుత ఆనవాళ్లు కనిపించకపోవడం వల్ల ఎటో వెళ్లిపోయి ఉంటుందనుకున్న గ్రామస్థులు.. మళ్లీ చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు. అధికారులు వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

ఇదీచూడండి: సీసీటీవీకి చిక్కిన చిరుత... కొనసాగుతున్న గాలింపు చర్యలు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో చిరుత సంచారం మళ్లీ కలవరం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఓ లేగ దూడపై చిరుత దాడి చేసింది. ఘటనలో గ్రామానికి చెందిన జెనిగల రాములు అనే రైతుకు చెందిన లేగదూడ మృతి చెందింది.

గత కొన్ని రోజులుగా చిరుత ఆనవాళ్లు కనిపించకపోవడం వల్ల ఎటో వెళ్లిపోయి ఉంటుందనుకున్న గ్రామస్థులు.. మళ్లీ చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు. అధికారులు వీలైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.

ఇదీచూడండి: సీసీటీవీకి చిక్కిన చిరుత... కొనసాగుతున్న గాలింపు చర్యలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.