తెలంగాణ రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షేమ విద్యపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు అవగాహన పరుగును నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల మీద ఉన్న భయాన్ని పక్కనపెట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్తీర్ణలయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా గురుకుల కళాశాలలు మంచి విద్యను అందిస్తున్నాయని తెలిపారు. సంక్షేమ విద్య కోసం ఈ నెల 25లోపు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేశారు.
'ప్రైవేటు కళాశాలలకు దీటుగా గురుకులాలు'
విద్యార్థులు పరీక్షలంటే భయంను వీడాలని అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షేమ విద్యపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థులు అవగాహన పరుగును నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల మీద ఉన్న భయాన్ని పక్కనపెట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్తీర్ణలయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా గురుకుల కళాశాలలు మంచి విద్యను అందిస్తున్నాయని తెలిపారు. సంక్షేమ విద్య కోసం ఈ నెల 25లోపు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలియజేశారు.