ETV Bharat / state

కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తికి.. అంత్యక్రియలు చేసిన ప్రజా ప్రతినిధి!

author img

By

Published : Aug 25, 2020, 8:19 AM IST

కరోనాతో సోకిన బాధితులను, పాజిటివ్ వచ్చి మృతి చెందిన వారిని కుటుంబ సభ్యులు, అయినవారే పట్టించుకోవడం లేదు. అలాంటిది మంచిర్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి మున్సిపల్​ వైస్​ ఛైర్మన్​ అంత్యక్రియలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

Manchirial municipal vice Chairman help Corona death
కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తికి.. అంత్యక్రియలు చేసిన ప్రజా ప్రతినిధి!

మంచిర్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి మున్సిపల్ వైస్​ ఛైర్మన్​ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో రెస్టారెంట్​ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులెవరూ ఆయన దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మంచిర్యాల పురపాలక సంస్థ వైస్​ ఛైర్మన్​ గాజుల ముఖేష్ గౌడ్​ తగు రక్షణ చర్యలు పాటించి మృతుడికి దహన సంస్కారాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు.

మంచిర్యాల జిల్లాలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి మున్సిపల్ వైస్​ ఛైర్మన్​ అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో రెస్టారెంట్​ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులెవరూ ఆయన దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మంచిర్యాల పురపాలక సంస్థ వైస్​ ఛైర్మన్​ గాజుల ముఖేష్ గౌడ్​ తగు రక్షణ చర్యలు పాటించి మృతుడికి దహన సంస్కారాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.