జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ పట్టణాల్లో పర్యటించి.. బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులకు తగిన సూచనలిచ్చారు.
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా లాక్డౌన్
జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిని హెచ్చరించి జరిమానా విధించారు.
నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వారిని హెచ్చరించి తగిన జరిమానా విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు. లాక్డౌన్ వల్ల రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ అవసరాల నిమిత్తం సరుకుల కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
- ఇదీ చదవండి మంటలు అంటుకుని 50 గుడిసెలు దహనం
జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్డౌన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ పట్టణాల్లో పర్యటించి.. బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులకు తగిన సూచనలిచ్చారు.
నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వారిని హెచ్చరించి తగిన జరిమానా విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఎవరూ తిరగకూడదని హెచ్చరించారు. లాక్డౌన్ వల్ల రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమ అవసరాల నిమిత్తం సరుకుల కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
- ఇదీ చదవండి మంటలు అంటుకుని 50 గుడిసెలు దహనం