ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి

author img

By

Published : Jun 15, 2020, 2:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో తెలుగుదేశం ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయుల దాడి చేశారు. ఓ శంకుస్థాపనకు వచ్చిన ఆయనపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు. వైకాపా తీరుకు నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ycp-attacked-on-mla-velagapudi-ramakrishna
తెదేపా ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి

ఏపీలోని విశాఖలో వైకాపా, తెలుగుదేశం మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఆరిలోవలో ఓ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనపై రాళ్ల వర్షం కరిపించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వైకాపా వర్గీయుల దుశ్చర్యలు పెచ్చుమీరుతున్నాయని ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆయన ఆరిలోవలోనే రోడ్డుపై బైఠాయించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

ఏపీలోని విశాఖలో వైకాపా, తెలుగుదేశం మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఆరిలోవలో ఓ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనపై రాళ్ల వర్షం కరిపించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వైకాపా వర్గీయుల దుశ్చర్యలు పెచ్చుమీరుతున్నాయని ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆయన ఆరిలోవలోనే రోడ్డుపై బైఠాయించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.