ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​

author img

By

Published : Apr 12, 2021, 6:44 PM IST

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలందరూ ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలన్నారు.

Governor Tamilisai
Governor Ugadi Wishes

ప్లవ నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నానని తమిళిసై పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ప్రభుత్వం సమయానుసారంగా ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందామని గవర్నర్ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం

ప్లవ నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నానని తమిళిసై పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ప్రభుత్వం సమయానుసారంగా ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందామని గవర్నర్ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.