హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో సీఐఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ రన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఐఐ యూవర్ లైఫ్తో కలిసి వెల్నెస్ రన్ 2020ని నిర్వహించింది. వ్యాయామం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
వ్యాయామంతో ఆరోగ్యం: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
వ్యాయామం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో సీఐఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ రన్ని ఆయన ప్రారంభించారు.
![వ్యాయామంతో ఆరోగ్యం: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ excise minister srinivas goud inaugurated wellnessrun in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9861800-thumbnail-3x2-srinivas.jpg?imwidth=3840)
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని.. అందుకు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. నడక, పరుగును ప్రతి ఒక్కరూ ప్రతి రోజు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ మాజీ ఛైర్మన్ సంజయ్ సింగ్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, తెలంగాణ డిఫెన్స్ ప్యానెల్ కన్వీనర్ ఆర్ఎస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి
హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్ హోటల్లో సీఐఐ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ రన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఐఐ యూవర్ లైఫ్తో కలిసి వెల్నెస్ రన్ 2020ని నిర్వహించింది. వ్యాయామం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని.. అందుకు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. నడక, పరుగును ప్రతి ఒక్కరూ ప్రతి రోజు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ-తెలంగాణ మాజీ ఛైర్మన్ సంజయ్ సింగ్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, తెలంగాణ డిఫెన్స్ ప్యానెల్ కన్వీనర్ ఆర్ఎస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి