AIG Nageshwara reddy: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి ఇవాళ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాంచీలో రెండు రోజుల పాటు గ్యాస్ట్రోలజీకి సంబంధించిన సెమినార్ జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన.. రాంచీలోని కంకే రోడ్లోని సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి సోరెన్తో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్కు డాక్టర్ నాగేశ్వర రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అరుణ్కుమార్ సింగ్, ముఖ్యమంత్రి కార్యదర్శి వినయ్కుమార్ చౌబే, ఏఐజీ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ మోహన్ రాంచందానీ పాల్గొన్నారు.
AIG Nageshwara reddy: ఝార్ఖండ్ సీఎంతో భేటీ అయిన ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి
AIG Nageshwara reddy: హైదరాబాద్కు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు డి.నాగేశ్వరరెడ్డి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ను కలిశారు. రాంచీలోని కంకే రోడ్లో ఉన్న ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. రాంచీలో గ్యాస్ట్రాలజీ అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న సెమినార్కు హాజరయ్యేందుకు వెళ్లారు.
AIG Nageshwara reddy: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి ఇవాళ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాంచీలో రెండు రోజుల పాటు గ్యాస్ట్రోలజీకి సంబంధించిన సెమినార్ జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన.. రాంచీలోని కంకే రోడ్లోని సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి సోరెన్తో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్కు డాక్టర్ నాగేశ్వర రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అరుణ్కుమార్ సింగ్, ముఖ్యమంత్రి కార్యదర్శి వినయ్కుమార్ చౌబే, ఏఐజీ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ మోహన్ రాంచందానీ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Imprisonment to Police: ఆ కేసులో నలుగురు పోలీసు అధికారులకు జైలుశిక్ష
రూ.76వేల కోట్లతో ఆయుధాలు కొనుగోలు.. భారత్ ఇక సూపర్ స్ట్రాంగ్!