భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ పరిధిలో వివిధ గ్రామాల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లపల్లి, మర్కోడు, అనంత గ్రామాల్లో దాడులు చేసి...144 మద్యం బాటిళ్లను, ఒకరిని అరెస్టు చేశారు. గ్రామాల్లో కాకుండా మద్యం సరఫరా చేసే వారిపై అధికారులు దృష్టిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
'గ్రామాల్లో కాదు... సరఫరాదారులపై దృష్టి పెట్టండి'
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేయటం వల్ల మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆటకట్టించారు.
!['గ్రామాల్లో కాదు... సరఫరాదారులపై దృష్టి పెట్టండి' Officers of the Excise Department have taken into custody those who illegally sell liquor in the Kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6863275-59-6863275-1587359761675.jpg?imwidth=3840)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్ పరిధిలో వివిధ గ్రామాల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లపల్లి, మర్కోడు, అనంత గ్రామాల్లో దాడులు చేసి...144 మద్యం బాటిళ్లను, ఒకరిని అరెస్టు చేశారు. గ్రామాల్లో కాకుండా మద్యం సరఫరా చేసే వారిపై అధికారులు దృష్టిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.