ప్రస్తుత ఐపీఎల్ సీజన్.. ధోనీ పునరాగమనానికి ఏమాత్రం ఉపయోగపడదని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. మహీ భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడని తెలిపాడు.
గతేడాది వన్డే ప్రపంచకప్ సెమీస్లో చివరగా ధోనీ మైదానంలో కనిపించాడు. అప్పటి నుంచి విరామంలోనే ఉన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్నకు ఎంపికవుతాడని అభిమానులు అందరూ భావించారు. కరోనా రావడం, ఐపీఎల్ వాయిదా, టీ20 ప్రపంచకప్ రద్దుతో మహీ కెరీర్ సందేహంలో పడింది. రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.