భారత్తో జరిగిన తొలి టీ20లో విజయం బంగ్లాదేశ్నే వరించింది. 149 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట్స్మెన్ ముష్ఫీకర్ రహీమ్(60) అర్ధశతకంతో చెలరేగి మ్యాచ్ను గెలిపించాడు. మరో ఆటగాడు సౌమ్యా సర్కార్ 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది బంగ్లా. టీ20ల్లో భారత్పై గెలవడం బంగ్లాకు ఇదే తొలిసారి.
-
That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019That's that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019
149 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే లిటన్ దాస్(7) వికెట్ కోల్పోయింది. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు నయీమ్(26), సౌమ్యా సర్కార్(39). నిలకడగా ఆడుతున్న నయీమ్ను ఔట్ చేశాడు చాహల్. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ముష్ఫీకర్ రహీమ్.. సౌమ్యా సర్కార్ సాయంతో చెలరేగాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా.. అనంతరం బ్యాట్ ఝుళిపించాడు.
మలుపు తిప్పిన ఓవర్..