Road Accident In Nellore District : ఏపీలోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం బండేపల్లి వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురు యవకులు మృతి చెందారు. వీరంతా డక్కిలి మండలానికి చెందిన వేర్వేరు గ్రామాలకు చెందినవారు. ప్రమాద స్థలంలో ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లింగసముద్రం నివాసి గోనుగొడుగు ఉదయ్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో సంగనపల్లికి చెందిన పరుచూరి సునీల్ (26) రాపూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేసరికి మృతిచెందారు. వెలికల్లుకు చెందిన శ్రీనివాసులు (28)ను మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బంధువుల రోదనలు..