కరోనాతో కుదేలైన ప్రముఖ ఆన్లైన్ ట్యాక్సీ బుకింగ్ సేవల సంస్థ ఉబర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ముంబయిలోని సంస్థ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సంస్థ ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఈ నిర్ణయం తీసున్నట్లు సంస్థకు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఉబర్ కొత్త కార్యాలయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు.